AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
జాతీయ పశువైద్య నియంత్రణ కార్యక్రమం ప్రారంభం కానున్నది.
కృషి వార్తAgrostar
జాతీయ పశువైద్య నియంత్రణ కార్యక్రమం ప్రారంభం కానున్నది.
న్యూ ఢిల్లీ: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే ప్రయత్నంలో సెప్టెంబర్ 11 న ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. పశువులలో లాలాజల వ్యాధి మరియు బ్రూసెలోసిస్ నిర్మూలనకు ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. కేంద్ర ప్రభుత్వం 100% నిధులను అందిస్తుంది 2024 వరకు ఐదేళ్ల కాలానికి 12,652 కోట్ల రూపాయల వ్యయం కేంద్ర ప్రభుత్వం అందించనుందని అంచనా. ఈ కార్యక్రమం 50 మిలియన్ పశువులు, గేదెలు, మేకలు, గొర్రెలు మరియు పందులకు టీకాలు వేస్తుంది. బ్రూసెలోసిస్ నిర్మూలనకు 3.6 మిలియన్ల ఆడ దూడలకు టీకాలు వేయడం కూడా ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమంలో రెండు అంశాలు ఉన్నాయి: 2025 నాటికి వ్యాధిని నియంత్రించడం మరియు 2030 నాటికి వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం. ఈ రోజున జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. అంతేకాకుండా, టీకా, వ్యాధి నిర్వహణ, కృత్రిమ గర్భధారణ మరియు ఉత్పాదకతపై దేశంలోని 687 జిల్లా వ్యవసాయ శాస్త్ర కేంద్రాల్లో దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు ప్రారంభించే అవకాశం ఉంది. మూలం - కృషి జాగ్రన్, సెప్టెంబర్ 10, 2019
61
0