సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
సీతాఫలం తోటలో నీటి నిర్వహణ
• ఉ. 6 గంటల నుంచి ఉ. 8. గంటల మధ్య సీతాఫలం తోటకు తప్పనిసరిగా నీటి సదుపాయం అందించాలి. ఎందుకంటే, తేమను నిర్వహించడం మరియు తగినంతగా నీటిని వినియోగించుకోవడం ద్వారా పుప్పొడికి నీటి సరఫరా అందుతుంది. పండు ఎదుగుదలలో ఇది అద్భుత ఫలితాలను ఇవ్వడంలో సహాయపడుతుంది.
• బిందు సేద్యం విధానం ఉపయోగించడం; ఇలా చేయడం ద్వారా 50 శాతం నుంచి 70 శాతం వరకు నీరు పొదుపు అవుతుంది. చెట్టుకు రెండు వైపులా రెండు పార్శ్వాలను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అదనంగా, రెండు డ్రిప్పర్లను ప్రతి వైపు అమర్చాలి. వేళ్లు విస్తరించిన ప్రాంతం చుట్టూ పూర్తి నీటి మొత్తం సమానంగా సరఫరా అయ్యేందుకు ఇది సహాయపడుతుంది, ఇలా చేస్తే చెట్టు సక్రమంగా పెరిగేందుకు సహాయపడుతుంది. తద్వారా నీరు కూడా తగినంతగా పొదుపు అవుతుంది.
• సేంద్రీయ లేదా ప్లాస్టిక్ పొర/ కవర్ను తోటలో ఉపయోగించడం ద్వారా నీరు మరియు పంటను రక్షించవచ్చు. చెట్టు యొక్క కాండం చుట్టూ ఈ పొర/ కవర్ను చుట్టండి.
సేంద్రీయ పొర/ కవర్ను ఉపయోగించడం కోసం, 8-10 కిలోల చెరకు మరియు ఎండిన గడ్డిని చెట్టు చుట్టూ ఏర్పాటు చేయండి. ఒకవేళ సేంద్రీయ పొర/ కవర్ సమృద్ధిగా లభిస్తే, అప్పుడు ఈ సేంద్రీయ పొరను చెట్టు యొక్క నీడ పడేంత వరకు తప్పనిసరిగా విస్తరించాలి. ఎందుకంటే నీడ పడేంతటి ప్రదేశం వరకు నీటిని మరియు పోషకాలను చెట్టు యొక్క వేళ్లు పీల్చుకుంటాయి, ఉపయోగించుకుంటాయి.
మూలం- ఆగ్రోస్టార్ అగ్రోనమి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి