సేంద్రీయ వ్యవసాయంశ్రీ సుభాష్ పాలేకర్ గారిచే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం
బీజామృతం తయారీ
బీజామృతం అనేది మొక్కలు, మొలకలు లేదా ఏవైనా నాటిన మొక్కల కొరకు ఒక చికిత్స. ఇది వర్షాకాలం తరువాత తరుచుగా పంటలకు సోకే మట్టిలో ఉన్న మరియు విత్తనాలలో ఉన్న చీడలతో పాటు శిలీంధ్రాల నుండి చిన్న వేర్లను సంరక్షించుటలో సమర్ధవంతమైనది. ఇది జీవామృతం వంటి ఇలాంటి పదార్ధాలతో కూర్చబడినది:
20 లీటర్ల నీరు, 5 కెజిల దేశీయ ఆవు పేడ, 5 లీటర్ల దేశీయ ఆవు మూత్రం, 50 గ్రాముల సున్నం & పొలం గట్టు మీద నుండి దోసెడు మట్టి తీసుకోండి.
• 5 కెజిల దేశీయ ఆవు పేడను ఒక వస్త్రంలోకి తీసుకుని దానిని టేపుతో మూట కట్టాలి. దీనిని 20 లీటర్ల నీటిలో 12 గంటల పాటు ఉంచండి.
• ఒక లీటరు నీరు తీసుకుని దానిలో 50 గ్రాముల సున్నం కలిపి, ఒక రాత్రంతా స్ధిరంగా ఉండనివ్వండి.
• తరువాతి ఉదయం, ఈ ఆవు పేడ మూటను వరుసగా మూడు సార్లు ఆ నీటిలోకి పిండాలి, దీని వల్ల ఆవు పేడ యొక్క మొత్తం సారం ఆ నీటిలోకి చేరుకుంటుంది.
• గుప్పెడు మట్టిని ఆ నీటి మిశ్రమంలో కలిపి చక్కగా కలియతిప్పండి
• చివరిగా ఆ మిశ్రమంలో 5 లీటర్లు దేశీయ ఆవు మూత్రం లేదా మానవ మూత్రాన్ని కలపండి మరియు
బీజామృతం వాడుక: విత్తన శుద్ధిగా ఏదేని పంట యొక్క విత్తనాలకు బీజామృతాన్ని కలపండి: వాటికి పట్టించి చేతులతో కలపండి; బాగా ఆరనిచ్చి నాటుటకు ఉపయోగించండి. కాయధాన్య విత్తనాల కొరకు, వేగంగా ముంచి లేపి ఆరనివ్వండి చాలు.
మూలం: శ్రీ సుభాష్ పాలేకర్ గారిచే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి