AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
జీవామృతం తయారీ: మంచి దిగుబడి పొందడానికి
సేంద్రీయ వ్యవసాయంఅగ్రోవన్
జీవామృతం తయారీ: మంచి దిగుబడి పొందడానికి
జీవామ్రిత/ జీవామృతం ఒక పులియబెట్టిన సూక్ష్మజీవుల పద్దతి. ఇది పోషకాలను అందిస్తుంది, చాలా ముఖ్యమైన,ఈ జీవామృతం అనునది శిలీంధ్ర మరియు బాక్టీరియా లాంటి మొక్క యొక్క వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడుతుంది.
జీవమృతాన్ని ఎలా సిద్ధం చేయాలి:_x000D_ 1. ఒక పీపా(బారెల్)లో 200 లీటర్ల నీరు ఉంచాలి; 10 కిలోల తాజాగా ఉన్నటువంటి స్థానిక ఆవు పేడను మరియు 5 నుండి 10 లీటర్ల వయస్సులో గల ఆవు మూత్రాన్ని జోడించండి; 2 కిలోల బెల్లం(స్థానికంగా ఉన్న ఒక రకమైన బ్రౌన్ షుగర్), 2 కిలోల పప్పుల పిండి మరియు పొలం యొక్క గట్టు నుండి కొంచెం మట్టిని తీసి వేయాలి._x000D_ 2. ద్రావణాన్ని బాగా కదిలించాలి మరియు నీడలో 48 గంటలు అది పులియనివ్వాలి. ఇప్పుడు జీవామృతం అనువర్తించడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక ఎకరా భూమికి 200లీటర్ల జీవామృతం సరిపోతుంది._x000D_ _x000D_ జీవామృతం యొక్క ప్రయోజనాలు:_x000D_ ● ఈ జీవామృతం,మొక్క పెరుగుదలకు మరియు మొక్క అభివృద్ధి చెందడానికి, మంచి దిగుబడిని ఇవ్వడానికి సహాయపడుతుంది._x000D_ ● ఇది తెగులు మరియు వ్యాధులుకు వ్యతిరేకంగా వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది._x000D_ ● ఇది ప్రయోజనకరమైన జీవ కార్యకలాపాలను పెంచుతుంది మరియు నేలలో సేంద్రీయ కార్బన్ లను ప్రోత్సహిస్తుంది._x000D_ ● జీవామృతం అప్లికేషన్: నీటి పారుదల నీటిలో నెలకు రెండు సార్లు పంటలకు జీవామృతాన్ని అనువర్తించాలి లేదా 10% ఫెయిల్యార్ స్ప్రేగా వర్తింపచేయాలి.._x000D_ _x000D_ _x000D_ మూలం: http://www.fao.org_x000D_ మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
707
2