AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఖరీఫ్‌ సీజన్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని అంచనా
కృషి వార్తఔట్లుక్ అగ్రికల్చర్
గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఖరీఫ్‌ సీజన్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని అంచనా
న్యూ ఢిల్లీ: గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 14.17 మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ, ఈసారి వర్షాకాలంలో దేశవ్యాప్తంగా మంచి వర్షపాతం నమోదైందని, దీనివల్ల ఖరీఫ్ పంటల ఉత్పత్తి అధికంగా ఉంటుందని, రబీ పంటలను విత్తడానికి కూడా ఇది మంచిదని అన్నారు.
అధిక వర్షాల కారణంగా దేశంలోని 12 రాష్ట్రాలు వరదలకు గురయ్యాయని, అయినప్పటికీ, ఆహార ఉత్పత్తి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. దేశంలో ఖరీఫ్ సీజన్లో అధిక వర్షపాతం కారణంగా రిజర్వాయర్ కూడా నిండి ఉన్నాయి. పప్పుధాన్యాలకు దేశం దాదాపుగా స్వయం సమృద్ధిగా మారిందని, అయితే దిగుమతులపై ఆధారపడటం తగ్గించడానికి నూనె గింజల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పంట సీజన్ 2019-20లో పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని 263 లక్షల టన్నులుగా నిర్ణయించగా, రికార్డు స్థాయిలో గోధుమల ఉత్పత్తి 10.05 మిలియన్ టన్నులుగా నిర్ణయించబడింది. ప్రస్తుత ఖరీఫ్‌లో వరి ఉత్పత్తి లక్ష్యం 1160 మిలియన్ టన్నులు. మూలం - ఔట్లుక్ అగ్రికల్చర్, 20 సెప్టెంబర్ 2019 మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
53
0