AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
‘ఆత్మ పథకం’తో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది
కృషి వార్తన్యూస్ 18
‘ఆత్మ పథకం’తో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది
న్యూఢిల్లీ. కేంద్ర ప్రభుత్వం 'ఆత్మ' (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది, దీని క్రింద వివిధ వ్యవసాయ సంబంధిత పథకాల క్రింద వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి రైతులకు శిక్షణ ఇస్తారు. ఈ పథకం 684 జిల్లాల్లో అమలు చేయబడింది. దీని క్రింద శిక్షణ, అధ్యయనం, పర్యటన, రైతు ప్రదర్శన, రైతు సంఘాలను ఏర్పాటు చేయడం, వ్యవసాయ పాఠశాలలను నిర్వహించడం జరుగుతుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు రైతుల మధ్య సమన్వయాన్ని ఏర్పరచడం కూడా ఈ పథకం యొక్క లక్ష్యం. దీన్ని సరిగ్గా అమలు చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచవచ్చు. శాస్త్రీయ పద్ధతిలో పంటను సాగు చేయడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. ఇప్పటివరకు, 19.18 లక్షల మంది రైతులకు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సాగు చేయడానికి శిక్షణ ఇవ్వబడింది. ఇండియన్ కౌన్సిల్ అఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రాల (కెవికె) ద్వారా రైతుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రదర్శనలను ఏర్పాటు చేస్తుందని వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ ఏడాది ఇది 15.75 లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్చింది. బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, ఇతర ధాన్యాలు మరియు పోషకమైన ధాన్యాల ఉత్పత్తిని మరియు ఉత్పాదకతను పెంచడానికి సుమారు 3,42,188 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. హార్టికల్చర్ డెవలప్‌మెంట్ మిషన్ క్రింద పండ్లు, కూరగాయలు, పుట్టగొడుగులు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, కొబ్బరి, జీడిపప్పు, వెదురు వంటి పంటలకు గురించి సుమారు 1,91,086 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. మూలం: న్యూస్ 18, 15 డిసెంబర్ 2019 ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి.
153
0